అమితాబ్ బచ్చన్ కు మద్దతిచ్చిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
on Mar 22, 2016
ఇండియా పాకిస్థాన్ మధ్య జరిగిన కోల్ కతా మ్యాచ్ లో జనగణమన పాడటానికి అమితాబ్ బచ్చన్ ను ఆహ్వానించింది బెంగాల్ క్రికెట్ ఆసోసియేషన్ క్యాబ్. ఆ రోజు మ్యాచ్ లో ఇండియా గెలిచింది. కానీ జనగణమన పాడిన అమితాబ్ పై మాత్రం కేసు నమోదైంది. అమితాబ్ జనగణమన తప్పుగా పాడారని పి.ఆర్.ఉల్లాస్ అనే వ్యక్తి ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ పిఎస్ లో కంప్లైంట్ రిజిస్టర్ చేశాడు. జాతీయగీతాన్ని ఎగ్జాక్ట్ గా 52 సెకన్లలో పాడాలని, అమితాబ్ మాత్రం 18 సెకన్లు ఎక్కువగా పాడారని, మంగళ దాయక అనకుండా మంగళనాయక అని తప్పు పాడారని ఫిర్యాదు సారాంశం.
అయితే దీనికి వ్యతిరేకంగా అమితాబ్ కు దేశవ్యాప్తంగా సపోర్ట్ లభిస్తోంది. ఆయన అద్భుతంగా పాడారంటూ సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అయితే, అమితాబ్ రాగయుక్తంగా, పెర్ఫెక్ట్ పిచ్ లో, స్పష్టమైన ఉచ్ఛారణలో పాడారని, ఆయన పాడిన విధానానికి తానెంతో గర్వించానని తన ఫేస్ బుక్ లో వ్యాఖ్యానించారు. ఒకవేళ లేటుగా పాడటం నేరం అయితే, లతా మంగేష్కర్, భీమ్ సేన్ జోషీ, తాను ఇంకా చాలా మంది కలిసి చేసిన జనగణమన ఆల్బమ్ డ్యూరేషన్ గురించి ఎవరూ ఎందుకు మాట్లాడలేదంటూ ప్రశ్నించారు.
కోర్టులు ఇప్పటికే చాలా తీవ్రమైన కేసుల్ని పరిష్కరించే పనుల్లో బిజీగా ఉన్నాయని, ఇలాంటి వృథా ప్రయత్నంతో కోర్టు సమయాల్ని వృథా చేయడం కరెక్ట్ కాదని హితవు పలికారు ఎస్పీబీ. ఆయన చెప్పిన దానికి కూడా సోషల్ నెట్ వర్కింగ్ లో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ట్విట్టర్లో రీట్వీట్లు, ఫేస్ బుక్ లో షేరింగ్ చేస్తూ నెటిజన్లు అమితాబ్ కు తమ సపోర్ట్ ను తెలియజేస్తున్నారు.
Also Read