ఇది భారత త్రివర్ణ పతాకం.. ఎన్నటికీ తగ్గేదే లే!
on Aug 22, 2022
అల్లు అర్జున్ ప్రస్తుతం న్యూయార్క్లో ఉన్నారు. తమ ఐకాన్ స్టార్ను అక్కడి ఫ్యాన్స్ పోస్టర్లతో స్వాగతించారు. దాంతో అక్కడి వీధులన్నీ అల్లు అర్జున్ పోస్టర్ల ప్రవాహంలో మునిగితేలాయి. న్యూయార్క్లో జరిగిన ఇండియా డే పెరేడ్కు భారతదేశ ప్రతినిధిగా గ్రాండ్ మార్షల్ హోదాలో పాల్గొనే అరుదైన అవకాశం బన్నీకి లభించింది. తన భార్య స్నేహారెడ్డితో కలిసి జాతీయ పతాకం చేతబూని ఆ పెరేడ్లో పాల్గొన్న అల్లు అర్జున్ను చూడ్డానికి భారతీయులు పోటెత్తారు. దాదాపు 5 లక్షల మంది దాకా భారతీయులు ఈ పెరేడ్లో పాల్గొని స్వదేశంపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
న్యూయార్క్లో జరిగిన ఈ ఈవెంట్కు ఇంత పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు హాజరుకావడం ఓ రికార్డుగా చెప్తున్నారు. వారంతా 'జైహింద్' నినాదాలతో ఆ ప్రదేశాన్ని హోరెత్తించారు. అల్లు అర్జున్ త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ, "యే భారత్ కా తిరంగా హై, కభీ ఝూకేగా నహీ" (ఇది భారతదేశ త్రివర్ణ పతాకం, ఎన్నటికీ తగ్గేదే లే) అని నినాదం చేశారు. కాగా ఈ సందర్భంగా న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ను అల్లు అర్జున్ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పలో సిగ్నేచర్ పోజ్ అయిన 'తగ్గేదే లే'కు బన్నీతో కలిసి ఎరిక్ ఆడమ్స్ అభినయించడం విశేషం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
