సుశాంత్ సినిమాలో విలన్గా కమెడియన్
on Oct 28, 2019
ప్రేక్షకులకు అభినవ్ గోమటం కమెడియన్గా తెలుసు. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో కౌషిక్ క్యారెక్టర్లో అతడు చేసిన కామెడీ అటువంటిది. తర్వాత హీరో బెల్లంకొండ సాయు శ్రీనివాస్, దర్శకుడు తేజ కాంబినేషన్లో వచ్చిన ‘సీత’లో కాజల్ అగర్వాల్ పక్కన ఉండే క్యారెక్టర్ చేశాడు. కానీ, సినిమా హిట్ కావడంతో పెద్దగా పేరు రాలేదు. ఇప్పుడు ‘మీకు మాత్రమే చెప్తా’లో సినిమా అంతా హీరో పక్కనే ఉండే క్యారెక్టర్ చేశాడు. త్వరలో ఈ కమెడియన్ విలన్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ చాలా రోజుల తర్వాత ‘చిలసౌ’తో హిట్ అందుకున్నాడు. వెంటనే అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘అల... వైకుంఠపురములో’ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయడానికి అంగీకరించాడు. సోలో హీరోగా కొత్త సినిమా ఏదీ ప్రకటించలేదు. కానీ, నవంబర్లో ఓ సినిమా స్టార్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అందులో అభినవ్ గోమటం విలన్గా కనిపించనున్నాడు. అతడిలో కామెడీ యాంగిల్ చూసిన ప్రేక్షకులకు, విలనిజాన్నీ పరిచయం చేయనున్నాడు.