హీరోలతో రాశీ ఖన్నా గొడవ...
on Oct 28, 2019
కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్లకు స్పేస్ పెద్దగా దొరకదు. రెండు మూడు పాటలు, నాలుగైదు సీన్లు, ఆరేడు డైలాగులు అన్నట్టు ఉంటుంది వ్యవహారం. మ్యాగ్జిమమ్ హీరోయిన్లు తమకు ఇచ్చిన సీన్ పేపర్ తీసుకుని, నటించేసి వెళ్లిపోతుంటారు. రాశీ ఖన్నా మాత్రం ఆ కేటగిరీ కాదు. తనకు తక్కువ సీన్లు ఇస్తే ఒప్పుకోదు. హీరోలను అడుగుతుంది.
అవసరమైతే రాశీ ఖన్నా హీరోలతో గొడవ పడుతుంది... 'స్టెప్పులు అన్నీ మీరే వేస్తారా? నేనూ స్టెప్పులు వేస్తాను. నాకో రెండు స్టెప్పులు ఎక్కువ ఇవ్వండి' అని. 'సీన్లో డైలాగులు అన్నీ మీరే చెప్పేస్తారా? కాంబినేషన్ సీన్లో ఆ డైలాగ్ నేను చెప్తే బావుంటుంది. నువ్వెందుకు చెప్తున్నావ్?' అని. 'ప్రతితోజూ పండగే' సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి తేజ్ ఈ సంగతి చెప్పాడు. రాశీ ఖన్నా కూడా అవునని అంగీకరించింది.
'సుప్రీమ్'లో వెన్నెల కిషోర్ తో సాయి తేజ్ చెప్పాల్సిన కొన్ని డైలాగులను రాశీ ఖన్నా చెప్పిందట. 'జై లవ కుశ' సాంగ్స్ లో ఎన్టీఆర్ తో వాదించి మరీ కొన్ని స్టెప్పులు వేసిందట. అదీ సంగతి. 'ప్రతిరోజూ పండగే'లో టిక్ టాక్ యాప్ కి అడిక్ట్ అయిన అమ్మాయి ఏంజిల్ ఆర్న పాత్రలో రాశీ ఖన్నా నటించింది. ఆమె పాత్ర తెరపైకి వచ్చిన ప్రతిసారీ ఏం చెబుతుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తారని దర్శకుడు మారుతి చెప్పారు.