మేము బిచ్చం ఎత్తుకున్నాం
on Jul 6, 2017
ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి..హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు ఆది..హీరోగా తప్ప మరే క్యారెక్టర్ చేయను అని గిరీ గిసుకుని చూడకుండా సరైనోడులో స్టైలిష్ విలన్గా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఇంత సైలెంట్గా కనిపిస్తున్నా..ఆది చిన్నప్పుడు అల్లరి బాగా చేసేవాడట..ముఖ్యంగా టాలీవుడ్లో అల్లరికి మారుపేరుగా నిలిచే మంచు మనోజ్తో రచ్చ రచ్చ చేసేవాడట. ఒకానొక టైంలో ఇద్దరి అల్లరి ఎక్కువైపోయి చివరకు బిచ్చం ఎత్తుకోవాల్సి వచ్చిందట.
రీసెంట్గా ఆది ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఈ విషయం చెప్పారు. మోహన్బాబు గారు, నాన్నగారు కలిసి చేసిన ఒక సినిమా కోసం యూనిట్తో పాటు మా రెండు కుటుంబాలు ఫ్రాన్స్ వెళ్లాయి..అక్కడ అందరూ షూటింగ్లో బిజీగా ఉంటే మనోజ్, నేనూ ఓ బస్సెక్కి ఎటో వెళ్లిపోయాం..కాసేపటికి తర్వాత తిరిగొచ్చి చూస్తే అక్కడ ఎవ్వరూ కనిపించలేదు..ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. మాకు ఫ్రెంచ్ రాదు..ఇంగ్లీష్ కాస్త వచ్చినా..అక్కడ ఎవ్వరూ మాట్లాడరు. ఇక చేసేదేం లేక ఒక నది పక్కన టోపీలు ముందు పెట్టుకుని తెలుగు పాటలు పాడుతూ బిచ్చగాళ్లం అయిపోయాం..కొంతమంది వేసిన డబ్బులతో టిక్కెట్లు కొనుక్కుని బస్సెక్కాం..అలా వెళ్తుండగా ఒకచోట జనం గుమిగూడి ఉండటంతో అక్కడ దిగి చూస్తే నాన్న, మోహన్ బాబు అంకుల్ కనిపించడంతో ప్రాణం లేచి వచ్చిందంటూ చెప్పుకొచ్చారు ఆది.