మాల్దీవులకు విజయ్-రష్మిక!
on Oct 7, 2022
'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' చిత్రాలలో కలిసి నటించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమలో ఉన్నారంటూ ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. కానీ తాము మంచి స్నేహితులం మాత్రమేనని ఈ ఇద్దరూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ఈ ఇద్దరూ కలిసి మాల్దీవులు టూర్ కి వెళ్తున్నారన్న వార్త ఆసక్తికరంగా మారింది.
గతంలో ముంబైలో డిన్నర్ కి వెళ్లి కెమెరాకి చిక్కిన విజయ్, రష్మిక.. తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో మరోసారి కెమెరా కంట పడ్డారు. మొదటి రష్మిక ఎయిర్ పోర్ట్ లోకి వెళ్లగా, కాసేపటికే విజయ్ ఎయిర్ పోర్ట్ లోకి వెళ్ళాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఇద్దరూ మాల్దీవులు వెకేషన్ కి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇటీవల 'లైగర్'తో ఘోర పరాజయం చూసిన విజయ్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం 'ఖుషి'పై దృష్టి పెడుతున్నాడు. మరోవైపు తాజాగా 'గుడ్ బై' అనే హిందీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన రష్మిక చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు వీరిద్దరూ వర్క్ లైఫ్ కి చిన్న బ్రేక్ ఇచ్చి మాల్దీవులు టూర్ కి వెళ్తున్నట్లు న్యూస్ వినిపిస్తోంది. దీంతో వీరిద్దరూ నిజంగానే లవ్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ మాల్దీవులు టూర్ పై విజయ్, రష్మిక ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read