వీవీ వినాయక్ వద్దని చెప్పేశాడట
on Feb 13, 2020
దర్శకుడు వీవీ వినాయక్ హీరోగా ప్రారంభమైన 'శీనయ్య' సినిమాను పక్కన పెట్టేశారట. పక్కన పెట్టేశారని చెప్పడం కంటే కొన్ని రోజులు షూటింగ్ చేశాక సినిమాను ఆపేశారని చెప్పడం కరెక్టుగా ఉంటుంది. అవును... దిల్ రాజు నిర్మాణంలో నరసింహారావు దర్శకుడిగా ప్రారంభమైన ఈ సినిమా షెడ్డుకు వెళ్లిందని ఇండస్ట్రీ టాక్. అందుకు కారణం వీవీ వినాయక్ అని సమాచారం. అసలు వివరాల్లోకి వెళితే... కొన్ని రోజులు ఈ సినిమా షూటింగ్ చేశారు. ఒక షెడ్యూల్ పూర్తయింది. రషెష్ చూసుకున్నారు. అప్పటివరకూ తెరకెక్కించిన సన్నివేశాలు చూశాక వీవీ వినాయక్ అసంతృప్తి వ్యక్తం చేశారట.
కథపై కూడా ఆయన సంతోషంగా లేరట. నిర్మాత దిల్ రాజుతో సినిమా ఆపేద్దామని రిక్వెస్ట్ చేశారట. ఏం పర్వాలేదనీ, సినిమా పూర్తి చేద్దామని దిల్ రాజు చెప్పినా... వినాయక్ వినలేదట. డబ్బులు వృధా చేయడం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదని సినిమా చేయవద్దని చెప్పేశాడట. అదీ సంగతి!! ఈ సినిమా కోసం వీవీ వినాయక్ బరువు తగ్గారు. కొంతకాలం జిమ్ కి వెళ్లారు. దర్శకుడిగా ఏ సినిమా కమిట్ కాకుండా టైమ్ కేటాయించారు. ఇంతాచేసి సినిమా వద్దని అనుకుంటున్నారంటే... రషెష్ అంత బ్యాడ్ గా ఉన్నాయి ఏమో?