`స్త్రీ` తరువాత మరోసారి..
on Jun 24, 2021
హారర్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన `స్త్రీ` (2018) చిత్రంలో కలిసి నటించారు రాజ్ కుమార్ రావ్, శ్రద్ధా కపూర్. అందులో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకి ఎస్సెట్ గా నిలిచింది. కట్ చేస్తే.. మూడేళ్ళ తరువాత ఈ ఇద్దరు మరోమారు జట్టుకట్టనున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. పూజా ఎంటర్టైన్మెంట్ సంస్థ అధినేత, నటుడు జాకీ భగ్నానీ నిర్మాణంలో శ్రద్ధా కపూర్ ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రొమాంటిక్ కామెడీ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ముదాస్సార్ అజీజ్ దర్శకత్వం వహించనున్నారు. కాగా, ఈ చిత్రంలో శ్రద్ధకి జంటగా రాజ్ కుమార్ రావుని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. అదే గనుక నిజమైతే.. `స్త్రీ` వంటి సక్సెస్ ఫుల్ మూవీ తరువాత రాజ్ కుమార్, శ్రద్ధా కపూర్ కాంబినేషన్ లో వచ్చే సినిమా ఇదే అవుతుంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం శ్రద్ధ చేతిలో రెండు చిత్రాలున్నాయి. అందులో ఒకటి లవ్ రంజన్ డైరెక్టోరియల్ కాగా, మరొకటి `ఛాల్ బాజ్ ఇన్ లండన్`. ఇక రాజ్ కుమార్ విషయానికొస్తే ప్రస్తుతం `హమ్ దో హమారే దో`, `బదాయి దో` సినిమాల్లో నటిస్తున్నాడు.