ENGLISH | TELUGU  

మహానటి.. అప్పుడు సావిత్రి, ఇప్పుడు సమంత!

on Dec 5, 2022

మహానటి అనగానే మనకు గుర్తొచ్చే పేరు సావిత్రి. ఎన్ని తరాలైనా మహానటిగా ప్రేక్షకుల హృదయాల్లో ఆమె పేరు నిలిచిపోతుంది. ఇక ఈ తరంలో మహానటి అనిపించుకునే అర్హత ఎవరికి ఉందనే ప్రశ్న తలెత్తితే.. 'మహానటి' చిత్రంలో సావిత్రి పాత్ర పోషించి మెప్పించిన కీర్తి సురేష్ పేరును కొందరు ప్రస్తావిస్తారు. అయితే సీనియర్ నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్ మాత్రం ఈ తరం మహానటి సమంత అంటున్నారు.

ఓటీటీ వేదిక ఆహాలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్' సీజన్-2 కి సురేష్ బాబు, అల్లు అరవింద్ గెస్ట్ లుగా వచ్చారు. ఈ సందర్భంగా బాలయ్య "ప్రస్తుత జనరేషన్ హీరోయిన్లలో మహానటి ఎవరు?" అని అడగగా.. సురేష్ బాబు, అల్లు అరవింద్ ఇద్దరూ అనుకోకుండా 'సమంత' పేరునే చెప్పారు. "ప్రస్తుతం ఉన్నవాళ్లలో మహానటి అవగలిగితే సమంత మాత్రమే అవగలదు" అని సురేష్ బాబు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ ని సమంత ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.