జమీందారి అమ్మాయిగా సాయిపల్లవి?
on Nov 24, 2020

వైవిధ్యానికి పెద్దపీట వేసే ఈ తరం నాయికల్లో సాయిపల్లవి ఒకరు. కథానాయికగా నటించిన తొలి చిత్రం 'ప్రేమమ్' (మలయాళం) నుంచి 'ఎన్జీకే' (తమిళం) వరకు తనది ఇదే బాణి. తెలుగులోనూ అదే శైలిని కొనసాగిస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 'విరాట పర్వం', 'లవ్ స్టోరీ' చిత్రాల్లోనూ పల్లవి ఇదివరకు పోషించని పాత్రల్లోనే దర్శనమివ్వనుంది.
ఇదిలా ఉంటే.. ఈ టాలెంటెడ్ బ్యూటీ తాజాగా ఓ భారీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అందులో జమీందార్ కుటుంబానికి చెందిన అమ్మాయి పాత్రలో కనిపిస్తుందట. ఆ సినిమా మరేదో కాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ క్రిష్ కాంబోలో రానున్న పిరియడ్ డ్రామా. పాత్ర నిడివి తక్కువే అయినా.. ప్రాధాన్యత ఉన్నది కావడంతో సాయిపల్లవి వెంటనే ఓకే చెప్పిందట. త్వరలోనే పవన్ సినిమాలో సాయిపల్లవి ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. మరి.. కొణిదెల వారి అబ్బాయ్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'ఫిదా'తో నటిగా సత్తా చాటిన పల్లవి.. కొణిదెల వారి బాబాయ్ సినిమాలోనూ ఆకట్టుకుంటుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



