'శాకిని డాకిని'గా రెజీనా, నివేదా వచ్చేస్తున్నారు!
on Aug 16, 2022
'స్వామి రారా', 'కేశవ' వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ 'శాకిని డాకిని'. రెజీనా కాసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బాబు, సునీత తాటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు.
'శాకిని డాకిని' షూటింగ్ ని చాలా సైలెంట్ గా పూర్తి చేశారు. ఇటీవల ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ చిత్రాన్ని థియేటర్స్ లోనే విడుదల చేస్తున్నట్లు తాజాగా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈ మూవీ సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో రెజీనా, నివేదా లుక్స్ ఆకట్టుకుంటున్నాయి.
సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 'ఓ బేబీ' తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. కొరియన్ ఫిల్మ్ 'మిడ్ నైట్ రన్నర్స్' స్ఫూర్తితో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులును ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.
Also Read