బాలయ్యతో తమన్.. ముచ్చటగా మూడోసారి?
on Feb 23, 2021
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో మినహా తెలుగునాట అగ్ర కథానాయకులందరి కాంబినేషన్ లోనూ యువ సంగీత సంచలనం తమన్ సినిమాలు చేశారు. ఇక నటసింహ నందమూరి బాలకృష్ణతో ఇప్పటికే `డిక్టేటర్` (2016) చేసిన ఈ సెన్సేషనల్ కంపోజర్.. రైట్ నౌ బోయపాటి శ్రీను డైరెక్టోరియల్ కోసం స్వరాలు సమకూర్చుతున్నారు. అంతేకాదు.. BB3 తరువాత బాలయ్య నటించబోయే సినిమాకి కూడా తమన్ నే బాణీలు అందించబోతున్నట్లు టాలీవుడ్ టాక్.
ఆ వివరాల్లోకి వెళితే.. `క్రాక్` వంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు గోపీచంద్ మలినేని తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని బాలయ్యతో చేయబోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికయ్యారని ఇన్ సైడ్ ఇన్ఫర్మేషన్. గోపీచంద్ డైరెక్ట్ చేసిన తొలి చిత్రం `డాన్ శీను`కి మినహా మిగిలిన అన్ని చిత్రాలకూ తమన నే సంగీత దర్శకుడు. ఈ నేపథ్యంలో.. `క్రాక్` వంటి సెన్సేషనల్ హిట్ తరువాత గోపీచంద్ డైరెక్ట్ చేయనున్న బాలయ్య సినిమాకి కూడా తననే కొనసాగిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
మరి... ముచ్చటగా మూడోసారి బాలయ్య, తమన్ జట్టుకడుతున్నారో లేదో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.