ఏపీ రాజకీయ నాయకులకు ఆర్జీవీ సలహా!
on Oct 21, 2021
ఆంధ్రప్రదేశ్ లో ఘర్షణ వాతావరం నెలకొన్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ మాఫియా అంశంలో సీఎం జగన్ పై టీడీపీ నేత పట్టాభి రామ్ చేసిన వివాదాస్పదమయ్యాయి. దీంతో వైసీపీ శ్రేణులు టీడీపీ కేంద్రకార్యాలయం, పట్టాభి ఇంటితో పాటు పలువురు టీడీపీ నేతల ఇల్లు, టీడీపీ కార్యాలయాలపై దాడులకు తెగబడ్డారు. ఈ దాడులను అందరూ ఖండిస్తుండగా అధికార పార్టీ వైసీపీ మాత్రం సమర్దించుకుంటోంది. సీఎం, మంత్రులు ఆ దాడుల్లో తప్పు లేదన్నట్లుగా వ్యాఖ్యానించారు. అయితే టీడీపీ మాత్రం రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోంది అంటూ జగన్ సర్కార్ పై మండిపడుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుకి సిద్ధమైంది. దీంతో ఏపీలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఏపీలో నెలకొన్న పరిస్థితులపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై ట్విట్టర్ వేదికగా ఆర్జీవీ తనదైన శైలిలో స్పందించారు. "ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే.. త్వరలోనే ఏపీ రాజకీయ నాయకులు బాక్సింగ్, కరాటే, కర్రసాము తదితర విద్యలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని" ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఆర్జీవీ ట్వీట్ వైరల్ గా మారింది. కొందరు నెటిజన్లు ''మీకు సినిమా తీయడానికి మంచి స్టొరీ' దొరికిందిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే సినిమా చేస్తున్నట్లు ఆర్జీవీ నేడో రేపో ప్రకటించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
