పూరి సినిమాలో జాన్వీ!!
on Aug 17, 2019
'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన పూరి వెంటనే క్రేజీ హీరో విజయదేవరకొండ హీరో గా ఓ సినిమా చేయబోతున్నట్లుగా ఇటీవల ఆఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. పూరి , ఛార్మి నిర్మాతలుగా వ్యహరిస్తున్నారు. విజయ్ సరసన హీరోయిన్ గా అతిలోకసుందరి కూతురు జాన్వీ కపూర్ నటించనున్నట్లు సమాచారం ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసిన పూరి.. ఇటీవల పూరి జాన్వీ తండ్రి బోనికపూర్ ని సంప్రదించినట్లు వినికిడి. ఆయన కూడా సుముఖంగానే ఉన్నారట. త్వరలో జాన్వీ ఎంట్రీ పై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. ఇక కాఫీ విత్ కరణ్ షో లో విజయ్ దేవరకొండ తో నటించాలని ఉంది అని చెప్పింది జాన్వీ. ఇక తన కోరికను పూరి తీర్చుతున్నాడు అంటున్నారు సినీ జనాలు. విజయ్ దేవరకొండ, జాన్వీ కాంబినేషన్ సెట్ అవ్వాలే కానీ సినిమాకు విపరీతమైన హైప్ రావడం ఖాయం. చూద్దాం ఎలా ఉంటుందో మరి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
