24 నుంచి ‘ప్రసన్నవదనం’ స్ట్రీమింగ్!
on May 23, 2024

తెలుగు ప్రేక్షకులకు అపరిమితమైన వినోదాన్ని పంచుతూ అగ్ర స్థానంలో దూసుకెళ్తోన్న ఏకైక తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’. ప్రతి వారం కొత్త కంటెంట్తో ప్రేక్షకులను రంజింప చేస్తోన్న ఆహా ఇప్పుడు మరో సూపర్ సక్సెస్ఫుల్ చిత్రం ‘ప్రసన్నవదనం’తో అలరించటానికి సిద్ధమైంది. ఇటీవల బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ రాబట్టుకున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మే 24 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. విలక్షణ నటుడు సుహాస్, పాయల్ రాధాకృష్ణ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో రాశీ సింగ్, వైవా హర్ష కీలక పాత్రల్లో నటించారు. నితిన్ ప్రసన్న, సాయి శ్వేత, కుషాలిని ఇతర ప్రధాన పాత్రల్లో ఆకట్టుకున్నారు. అర్జున్ వై.కె ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. లిటిల్ థాట్స్ సినిమాస్, మణికంఠ జె.ఎస్, ప్రసాద్ రెడ్డి టి.ఆర్ నిర్మించిన ఈ చిత్రానికి అర్హ మీడియా సహ నిర్మాతగా వ్యవహరించారు. డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా చూసి ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.
ప్రొసోఫాగ్నోసియా (ముఖం, గొంతులను సరిగ్గా గుర్తుపట్టలేని వ్యాధితో బాధపడటం) అనే పాయింట్ కథ రన్ అవుతుంది. ఈ లక్షణాలు ఉన్నవాళ్లు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటారనే పాయింట్పై ఇప్పటి వరకు తెలుగులో సినిమా రాలేదు. ఈ యూనిక్ అంశంతో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించింది.
సినిమా కథాంశంతో పాటు నటీనటులు చక్కటి నటనతో సినిమాలోని పాత్రలను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేయటం మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. హీరో సుహాస్ ప్రొసోఫాగ్నోసియా లక్షణాలతో బాధపడే యువకుడిగా తెరపై చక్కటి మానసిక సంఘర్షణలను తెరపై పండించారు.
డిఫరెంట్ కథలతో తెరకెక్కిన సినిమాలు ఆదరణ పొందుతున్న తరుణంలో ‘ప్రసన్నవదనం’ వంటి సినిమా ఓటీటీ మాధ్యమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావటం అనేది కొత్త కథాంశాలతో సినిమాలు చేయాలనుకునే వారికి మరింత శక్తినిచ్చేలా ఉంది. ఇలాంటి దృక్పథాల కారణంగా మరిన్ని వైవిధ్యమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయనటంలో సందేహం లేదు.
మే 24న ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ‘ప్రసన్నవదనం’ సినిమాను మిస్ చేసుకోవద్దు. ఓ వైపు ఆలోచన రేకెత్తిస్తూనే తిరుగులేని ఎంటర్టైన్మెంట్ను ఈ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని అసల్సు వదులుకోకండి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



