మిస్సమ్మను రీ-రీమిక్స్ చేస్తున్న చెర్రీ
on Apr 29, 2014
అలనాటి "మిస్సమ్మ" సినిమాలో "ఆడువారి మాటలకూ..." పాట ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ పాటను పవన్ కళ్యాణ్ తన సినిమాలో రీమిక్స్ చేసి "ఖుషి" సినిమాలో వాడుకున్నాడు. ఈ పాట కూడా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. అయితే ఇపుడు బాబాయ్ పాటను తనయుడు రీ-రీమిక్స్ చేస్తున్నాడు.
కృష్ణవంశీ దర్శకత్వంలో రాంచరణ్, కాజల్ జంటగా నటిస్తున్న చిత్రం "గోవిందుడు అందరివాడేలే". ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఈ పాటను రీమిక్స్ చేస్తున్నారు. ఈ పాటను చరణ్, కాజల్ లపై చిత్రీకరించనున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్లో నిర్మాత బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇంటిల్లిపాదీ చూసి ఆనందించే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ అంటున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.