అల్లు శిరీష్ సరసన నితిన్ భామ
on Apr 29, 2014
"అలా మొదలైంది" చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన నిత్యామీనన్ ఆ తర్వాత వరుస సక్సెస్ లతో దూసుకుపోతుంది. ఆ తర్వాత నితిన్ తో "ఇష్క్", "గుండెజారి గల్లంతయ్యిందే" వంటి హిట్ చిత్రాలలో నటించి మంచి నటిగా పేరు తెచ్చుకుంది. తెలుగు, తమిళ వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో ఓ కొత్త చిత్రాన్ని అంగీకరించింది.
"గౌరవం" వంటి అట్టర్ ఫ్లాప్ చిత్రం ద్వారా మన ముందుకు వచ్చిన అల్లు శిరీష్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో శిరీష్ సరసన హీరోయిన్ గా నిత్యాను ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రానికి పవన్ సాధినేని దర్శకత్వం వహించనున్నాడు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
ప్రస్తుతం అల్లు శిరీష్ నటించిన "కొత్తజంట" చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నిర్మించాడు. అదే విధంగా నిత్యా ప్రస్తుతం శర్వానంద్ తో ఓ చిత్రం చేస్తుంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.