ENGLISH | TELUGU  

అల్లు శిరీష్ సరసన నితిన్ భామ

on Apr 29, 2014

 

"అలా మొదలైంది" చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన నిత్యామీనన్ ఆ తర్వాత వరుస సక్సెస్ లతో దూసుకుపోతుంది. ఆ తర్వాత నితిన్ తో "ఇష్క్", "గుండెజారి గల్లంతయ్యిందే" వంటి హిట్ చిత్రాలలో నటించి మంచి నటిగా పేరు తెచ్చుకుంది. తెలుగు, తమిళ వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో ఓ కొత్త చిత్రాన్ని అంగీకరించింది.

"గౌరవం" వంటి అట్టర్ ఫ్లాప్ చిత్రం ద్వారా మన ముందుకు వచ్చిన అల్లు శిరీష్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో శిరీష్ సరసన హీరోయిన్ గా నిత్యాను ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రానికి పవన్ సాధినేని దర్శకత్వం వహించనున్నాడు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

ప్రస్తుతం అల్లు శిరీష్ నటించిన "కొత్తజంట" చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నిర్మించాడు. అదే విధంగా నిత్యా ప్రస్తుతం శర్వానంద్ తో ఓ చిత్రం చేస్తుంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.