అఫీషియల్.. సుజీత్ డైరెక్షన్ లో పవర్ స్టార్ యాక్షన్ ఫిల్మ్
on Dec 4, 2022

'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయబోతున్నట్లు కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. ఇదొక రీమేక్ మూవీ అని గతంలో ప్రచారం జరిగింది. కానీ ఇది రీమేక్ కాదు.. ఒరిజినల్ స్టోరీతో పవర్ స్టార్ ని పవర్ ఫుల్ గా చూపించబోతున్నాడు సుజీత్.
అగ్ని తుఫాను రాబోతోంది అంటూ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రకటన వచ్చింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ లో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించనున్నాడు. మూవీని ప్రకటిస్తూ విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ పవర్ ఫుల్ గా, ఆకట్టుకునేలా ఉంది. ఇదొక గ్యాంగ్ స్టర్ మూవీ అని, సబ్జెక్ట్ ఇంటర్నేషనల్ రేంజ్ లో ఉండనుందని తెలుస్తోంది. రవి కె.చంద్రన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

సుజీత్ డైరెక్ట్ చేసిన 'సాహో' సౌత్ లో పరాజయంపాలైనప్పటికీ నార్త్ లో ఘన విజయం సాధించింది. అందు+-లోని యాక్షన్ సన్నివేశాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు పవన్ తో చేస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్ లో తమ హీరోని ఓ రేంజ్ లో చూపిస్తాడని ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.
ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' చిత్రం చేస్తున్న పవన్.. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయనున్నాడు. హరీష్, సుజీత్ ప్రాజెక్ట్ లు రెండు పారలల్ గా షూటింగ్ జరిగే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



