పొంగల్ సీజన్లో పవన్ పిరియడ్ డ్రామా?
on Jan 28, 2021
రి-ఎంట్రీలో వరుస సినిమాలతో టాక్ ఆఫ్ టాలీవుడ్ అవుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అంతేకాదు.. తక్కువ గ్యాప్ లోనే ఆయా చిత్రాలతో సందడి చేయబోతున్నారు. ఈ ఏడాది వేసవిలో వకీల్ సాబ్ తోనూ, పంద్రాగస్టు వారాంతంలో అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ తోనూ ఈ కొణిదెల స్టార్ వినోదాలు పంచనున్నారు. అంతేకాదు.. వచ్చే ఏడాది సంక్రాంతికి తన తొలి పిరియడ్ డ్రామాతో పలకరించబోతున్నారట.
మొఘలాయిల కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వెర్సటైల్ డైరెక్టర్ క్రిష్ కెప్టెన్ కాగా.. వెటరన్ ప్రొడ్యూసర్ ఎ.ఎం. రత్నం నిర్మాత. ఇందులో రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ దర్శనమివ్వనున్నారు. ఇప్పటికే కొంతమేర షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా.. ఏడాది చివరి నాటికి అన్ని విధాలా సిద్ధమవుతుందని, పొంగల్ సీజన్ లో పవన్ ఫస్ట్ పిరియడ్ డ్రామా థియేటర్స్ లో ఎంటర్ టైన్ చేయడం ఖాయమని ఫిల్మ్ నగర్ టాక్. మరి.. ఈ సినిమా పవర్ స్టార్ కి ఎలాంటి గుర్తింపుని తీసుకువస్తుందో చూడాలి.