నా కష్టాలు తీరాయి - నయన తార
on Feb 4, 2012
నా కష్టాలు తీరాయి అని 9 తార అంటుంది. వివరాల్లోకి వెళితే పెళ్ళయి ఇద్దరు పిల్లలున్న ప్రభుదేవాని ప్రేమించి అతనితో వివాహానికి సిద్ధపడి, అతని భార్యకు అతనితో విడాకులిప్పించింది ప్రముఖ హీరోయిన్ నయనతార. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమోకానీ ప్రభుదేవాతో విడిపోయింది. దాని గురించి మాట్లాడుతూ "నా కష్టకాలం అంతా అయిపోయింది. నా కష్టాలన్నీ తీరాయి. ఈ సమయంలో నేను సినిమాలకు బాగా దూరమయ్యాను. అందుకని నేను నా సినీ కెరీర్ మీదే దృష్టి పెడదామనుకుంటున్నాను" అని అంది నయనతార.
నయనతార ప్రస్తుతం కామాక్షీ కళా మూవీస్ వారు యువసామ్రాట్ అక్కినేని నాగార్జున హీరోగా నిర్మించబోతున్న సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించటానికి అంగీకరించింది. ఈ చిత్రం అమెరికా, హైదరాబాద్ లలో చిత్రీకరిస్తారు.