"రచ్చ" షూటింగ్ ఆపారు
on Feb 4, 2012
"రచ్చ" షూటింగ్ ఆపారు. వివరాల్లోకి వెళితే మెగాసూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా, సంపత్ నంది దర్శకత్వంలో, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం"రచ్చ". ఈ "రచ్చ" చిత్రం షుటింగ్ కేరళలోని పెరియార్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఒక లేక్ దగ్గర హీరో రామ్ చరణ్, హీరోయిన్ త్రమన్నాలపై ఒక డ్యూయెట్ తీద్దామని దర్శకుడు సంపత్ నంది ప్లాన్ చేశాడు.
అంతా సిద్ధంగా ఉన్న సమయంలో పెరియార్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ డిప్యూటీ డైరెక్టర్ సంజయ్ కుమార్ అక్కడకు వచ్చి లైఫ్ జాకెట్ లేకుండా ఎవరినీ బోట్ లో ఆ లేక్ లోకి అనుమతించమని ఖరాఖండిగా చెప్పటంతో వళ్ళుమండిన దర్శకుడు సంపత్ నంది వెంటనే ప్యాకప్ చెప్పాడట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



