హోటల్ రూమ్ లో నరేష్, పవిత్ర.. మూడో భార్య ఎంట్రీతో రచ్చరచ్చ!
on Jul 3, 2022
సీనియర్ యాక్టర్స్ నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వాళ్ళిద్దరూ ఒక హోటల్ లో ఉండగా.. అక్కడికి నరేష్ మూడో భార్య రమ్య వెళ్లి పవిత్రను కొట్టడానికి ప్రయత్నించడం హాట్ టాపిక్ గా మారింది.
పవిత్రను నాలుగో పెళ్లి చేసుకోవడానికి నరేష్ సిద్ధమయ్యాడని ఎప్పటినుంచో న్యూస్ వినిపిస్తోంది. ప్రస్తుతం వారిద్దరూ కలిసే ఉంటున్నారని టాక్. అయితే తాజాగా వారిద్దరూ మైసూరులోని ఒక హోటల్ గదిలో ఉండగా.. అక్కడికి పోలీసులు, మీడియాతో రమ్య ఎంటరైంది. అంతేకాదు పవిత్రను చెప్పుతో కొట్టే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అక్కడ పోలీసులు లేకపోయుంటే మరింత రచ్చ జరిగి ఉండేదని సమాచారం. ఇదిలా ఉంటే తన మూడో భార్య రమ్య హోటల్ దగ్గరికి వచ్చి గొడవ చేస్తున్న సమయంలో నరేష్ నవ్వుకుంటూ పవిత్రతో కలిసి బయటకు వెళ్లడం విశేషం.
ఫ్రెండ్స్ అని చెబుతున్న నరేష్, పవిత్ర ఒకే హోటల్ రూమ్ లో ఎలా ఉన్నారని రమ్య ప్రశ్నించారు. తనకు విడాకులు వద్దని, విడాకులు ఇవ్వకుండా నాలుగో పెళ్లి ఎలా చేసుకుంటారని క్వశ్చన్ చేస్తున్నారు.
కాగా గతంలో నరేష్ పేరు చెప్పి రమ్య కొందరి దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలోనే తనకు, రమ్యకు ఎలాంటి సంబంధం లేదని.. తాము అసలు కలిసి ఉండటం లేదని నరేష్ చెప్పారు. ఆ తర్వాత నరేష్ నాలుగో పెళ్లి అంశం తెరపైకి వచ్చి, ఇప్పుడు ఈ వివాదం మరింత ముదిరింది.