నాన్నకు నేనంటే బోరేమో - నాగార్జున
on May 13, 2014
సాదా సీదాగా సినిమా తీసినా పబ్లిసిటీ మాత్రం తెలివిగా చేసుకోవాలి. దీనికి ఎవరి సినిమాలు మినహాయింపు కావు. అందుకే హీరో నాగార్జున ‘మనం’సినిమా పబ్లిసిటి చాల వెరైటీగా చేస్తున్నాడు. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన తండ్రీ అక్కినేని గురించి ఎన్నో విషయాలు మాట్లాడాడు. ఏఎన్ఆర్ తమని స్నేహితులులా చూసుకునేవారని, ఆయన తండ్రి ఇంటికి వెళ్ళినప్పుడు ఒక స్నేహితుడుని అడిగినట్లు డ్రింక్ చేస్తావా అని అరమరికలు లేకుండా అడిగేవారని తన తండ్రి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకున్నాడు నాగార్జున. మనం సినిమా షూటింగ్ విశేషాలు వివరిస్తూ, తండ్రితో నటించినప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి వీలు కలిగిందన్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ లో అక్కినేని తన గురించి ఏమాత్రం పట్టించు కోకుండా తన ద్రుష్టి అంతా నాగచైతన్య పైనే పెట్టి సలహాలు ఇచ్చే వారని, అది చూసి తనకు కొంత ఉక్రోషంగా అనిపించేదన్నారు. ఆ విషయం తండ్రిని అడుగుదామని అనుకొని అడగలేక పోయానన్నారు. అలాగే తండ్రికి తనంటే బోర్ కొట్టి ఉండవచ్చునేమోనని చెప్పుకొచ్చారు నాగార్జున. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై విక్రమ్కుమార్ దర్శకత్వంలో నాగార్జున నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. సినిమా విడుదల కోసం అసంఖ్యాక ప్రేక్షకులు, అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .