అది మూవీ ప్రమోషనా..ప్రాంకా!
on Nov 10, 2022
ఈమధ్య కొత్త సినిమాలు, చిన్న సినిమాల జోరు మాములుగా లేదు. అవే అనుకుంటే వాటి ప్రొమోషన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఐతే ప్రొమోషన్స్ కి ప్రాంక్స్ కి తేడా లేకుండా ఐపోయింది. ఏది ప్రొమోషనో ఏది ప్రాంకో అర్ధం కాకుండా ఉంది. ఇక ఇప్పుడు కూడా అలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇలాంటి సినిమా ప్రొమోషన్స్ ని టేస్టీ తేజ ఎక్కువగా చేస్తూ ఉంటాడు. అద్దిరిపోయే ఫుడ్ తింటూ మూవీ టీమ్స్ తో మాట్లాడుతూ వెరైటీగా ప్రమోట్ చేస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు "నచ్చింది గర్ల్ ఫ్రెండ్ " మూవీ ప్రమోషన్ చూస్తే నిజంగా షాకవుతారు.
ఇక టేస్టీ తేజ, ఈ మూవీ హీరో ఉదయ్ శంకర్, హీరోయిన్ జెన్నిఫర్ ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటూ ప్రమోషన్ చేస్తున్నారు. తింటుండగా మధ్యలో ఐశ్వర్య రాజేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నట్లు హీరో చెప్పేసరికి " ఆవిడ మీతో కలిసి చేసిందా" అని తేజ వెటకారమాడేసరికి చిర్రెత్తుకొచ్చింది ఉదయ్ శంకర్ కి..ఫుడ్ పెట్టి ఇలా ఇన్సల్ట్ చేయడం ఏమీ బాలేదు అన్నాడు సీరియస్ గా . నువ్వు జెన్నిఫర్ తో మాట్లాడుతున్నావ్..మాట్లాడు నా విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటావ్ ...ఇదెక్కడి ఇన్సల్ట్ రా బాబు అనుకుని ఇద్దరూ కొట్టుకునే వరకు వచ్చేసారు.
ఇక జెన్నిఫర్ కి ఏం అర్థంకాలేదు. లేడీస్ ఉన్నప్పుడు కాస్త రెస్పెక్ట్ గా ఉండడం నేర్చుకోండి అని చెప్పినా ఆ ఇద్దరూ వినలేదు. ఇక జెన్నిఫర్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది." ఇలాంటి ప్రొమోషన్స్ కొంచెం వేలం వెర్రిగా ఉంటాయనడానికి ఇదే ఉదాహరణ.