పెదనాన్న సినిమా నేల క్లాస్ టికెట్తో చూసాను: వరుణ్ తేజ్
on Apr 11, 2017
వరుణ్ తేజ్, శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న మిస్టర్ సినిమా ఈ నెల 14 న విడుదలకి సిద్దమవుతుంది. యూనిట్ అంతా సినిమాని ప్రమోట్ చేయటంలో బిజీగా ఉన్నారు. మిస్టర్ సక్సెస్ అవ్వడం అటు తేజ్ కి ఇటు వైట్ల కి ఖచ్చితం. ఇద్దరిలో కామన్ థింగ్ ఏంటంటే చిరంజీవి సినిమా మొదటి రోజు మొదటి ఆట ఎట్టి పరిస్థితుల్లో చూడాల్సిందే. అయితే, వైట్లకి చిరు తో పని చేసే అవకాశం అందరివాడుతో వచ్చింది, కానీ తేజ్ మాత్రం ఆ సదవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఖైదీ నం 150 లో మెగా హీరోలందరినీ ఒక పాటలో కనిపించేట్టుగా మొదట అనుకున్నారు.
కానీ, కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. వరుణ్ మాత్రం చిరు కాల్ కోసం వేయి కళ్ళతో వేచి చూస్తున్నాడు. ఇదిలా ఉంటే, చిరంజీవి సినిమా మొదటి రోజు మొదటి ఆట గురించి మాట్లాడుతూ, తాను పెదనాన్న ప్రతి సినిమా మిస్ అవకుండా చూసే వాణ్ణి అని. అమీర్పేట్ లో చదివేప్పుడు ఏకంగా నేల క్లాస్ టికెట్ తీస్కొని స్క్రీన్ కి అతి దగ్గరగా అంటే మొదటి రోలో కూర్చుని ఫ్రెండ్స్ తో కలిసి హంగామా చేసేవాడినని, గుర్తు చేసుకున్నాడు. ఏదైనా మాస్ సెంటర్ లో మాస్ జనాలతో మాస్ సినిమా చూస్తే ఆ కిక్కే వేరప్పా. వరుణ్ లాంటి స్టార్ యే ఆ ఎంజాయ్ మెంట్ కోరుకుంటున్నాడు... మరి మనకు మాత్రం అలా చూడాలని ఉండదా. మీరేమంటారు!
Also Read