విజయ్ కంటే మైక్ టైసన్ కే ఎక్కువ రెమ్యునరేషన్!
on Aug 16, 2022
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా ఫిల్మ్ 'లైగర్'. అనన్య పాండే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో కనువిందు చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోగా నటించిన విజయ్ కంటే.. స్పెషల్ లో రోల్ లో నరించిన మైక్ టైసనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మొదటి పాన్ ఇండియా సినిమా రిలీజ్ కాకముందే నార్త్ లోనూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న విజయ్ కి ఈ సినిమా కోసం ఏకంగా రూ.35 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే మైక్ టైసన్ కి అంతకంటే ఎక్కువగా ఏకంగా రూ.40 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. బాక్సర్ గా మైక్ టైసన్ కి ఇంటర్నేషనల్ వైడ్ గా గుర్తింపు ఉంది. సినిమాకి చాలా కీలకమైన పాత్ర కావడంతో పాటు, ఆ పాత్రకి మైక్ టైసనే కరెక్ట్ అని భావించిన మూవీ టీమ్.. ఆయనకు భారీ మొత్తం చెల్లించి ఆ పాత్ర కోసం ఒప్పించినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన అనన్యకు రూ.3 కోట్ల ఇచ్చినట్లు సమాచారం. అంటే హీరో, హీరోయిన్ ల ఇద్దరి రెమ్యునరేషన్స్ కలిపినా మైక్ టైసన్ కంటే తక్కువేనన్నమాట.
ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో ఆగస్టు 25న తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.