'ఆదిపురుష్' ఈవెంట్ లో జన ప్రభంజనం.. లక్షమంది పైనే!
on Jun 6, 2023
దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ఆదిపురుష్'. రామాయణ గాధ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా కనువిందు చేయనున్నాడు. టీ సిరీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకుడు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈరోజు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
'ఆదిపురుష్' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చిన్న జీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభాస్, కృతి సనన్, ఓం రౌత్ తో పాటు ఇతర చిత్ర బృందం పాల్గొన్న ఈ కార్యక్రమానికి జనం భారీ ఎత్తున తరలివచ్చారు. లక్షమందికి పైగా ఈ వేడుకకు హాజరయ్యారనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. గ్రౌండ్ కెపాసిటీకి మించి 60 వేల మందికి పైగా గ్రౌండ్ లోపలికి అనుమతించగా, గ్రౌండ్ వెలుపల దాదాపు 50 వేల మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. తెలుగు సినీ చరిత్రలోనే అత్యధిక మంది హాజరైన వేడుకల్లో ఒకటిగా ఇది నిలుస్తుందని అంటున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
