`మహానటి` కి దక్కిన మరో గౌరవం!!
on May 4, 2019
మహానటి సావిత్రి లైఫ్ హిస్టరీ ఆధారంగా తెరకెక్కిన చిత్రం `మహానటి`. ఈ చిత్రం అటు ప్రేక్షకుల ఇటు విమర్శకుల ప్రశంసలు అందుకుని అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. వైజయంతి మూవీస్ బేనర్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇక సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించింది అనడంకంటే జీవించింది అంటే బాగుంటేదేమో. వెండితెరపై మాయ చేసిన `మహానటి` బుల్లితెర పై కూడా తన సత్తాను చాటింది. తాజా గా ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. 22వ షాంఘై ఇంటర్నేషనల్ ఫిలి ఫెస్టివల్ (ఎస్ఐఎఫ్ఎఫ్) కు మహానటి చిత్రం సెలక్ట్ అయింది. దీనికి ఎంపికైన తొలి ఇండియన్ సినిమాగా మహానటి రికార్డ్ లకెక్కింది. దీంతో మహానటి టీమ్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.