శర్వాకు జోడిగా కృతి శెట్టి.. హిట్ ట్రాక్ ఎక్కేనా?
on Sep 21, 2023
టాలెంటెడ్ హీరో శర్వానంద్ తన 35వ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో చేస్తున్న సంగతి తెలిసిందే. 'భలే మంచి రోజు', 'శమంతకమణి', 'దేవ్ దాస్', 'హీరో' వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
మొదటి చిత్రం 'ఉప్పెన'తోనే క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కృతి శెట్టి ఈ చిత్రంలో శర్వానంద్ కు జోడిగా నటిస్తోంది. ఈరోజు కృతి శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టర్ తో పాటు, స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కృతి శెట్టి అందంగా, క్యూట్ గా కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది. హ్యాట్రిక్ హిట్స్ తో కెరీర్ ప్రారంభించిన కృతి, ఆ తర్వాత వరుస పరాజయాలు ఎదుర్కుంటోంది. మరి ఈ సినిమాతోనైనా మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కుతుందేమో చూడాలి.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఒక షెడ్యూల్ మినహా మిగతా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ సినిమాలో శర్వానంద్ ఇంట్రెస్టింగ్ పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు.
'ఖుషి'తో తెలుగు ప్రేక్షకులకు మ్యాజిక్ చేసిన హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ చేస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేస్తున్నారు.జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
