ENGLISH | TELUGU  

చరణ్‌-శంకర్‌ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా కియారా

on Jul 31, 2021

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌- సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్‌ కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై దిల్‌రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా పలువురి పేర్లు వినిపించాయి. ముఖ్యంగా కియారా అద్వానీ, ఆలియా భట్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే ఈ మూవీలో కియారా నటించనున్నట్లు తాజాగా మూవీ టీమ్ అధికారిక ప్రకటన ఇచ్చింది.

మహేష్ బాబు నటించిన 'భ‌ర‌త్ అనే నేను' మూవీతో టాలీవుడ్ కి హీరోయిన్ పరిచయమైన బాలీవుడ్‌ బ్యూటీ కియారా.. ఆ తర్వాత రామ్ చరణ్ సరసన 'విన‌య విధేయ‌రామ'లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ.. రామ్ చరణ్ సరసన మరోసారి నటించనుంది. చరణ్-శంకర్ ల పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో ఆమెకు హీరోయిన్ ఆఫర్ వచ్చింది. శ‌నివారం(జూలై 31) కియారా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ లోకి కియారాకు స్వాగతం చెబుతూ ఓ ఫొటోని షేర్‌ చేసింది.

ఈ సంద‌ర్భంగా కియారా మాట్లాడుతూ.. "ఇప్ప‌టి వ‌ర‌కు నా పుట్టిన‌రోజుకి వ‌చ్చిన గిఫ్ట్స్‌ లో ఇది బెస్ట్ బ‌ర్త్ డే గిఫ్ట్‌. ఈ ప్రాజెక్ట్ లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. షూటింగ్ ఎప్పుడు మొద‌ల‌వుతుందా అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను" అని అన్నారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.