పవన్కి జోడీగా కియారా అద్వాని?
on Jan 5, 2021
.jpg)
గబ్బర్ సింగ్ వంటి సెన్సేషనల్ హిట్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించనున్నారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశముంది.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన కథానాయికగా ఉత్తరాది భామ కియారా అద్వానిని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. ఇప్పటికే ఈ మేరకు కియారాతో హరీష్ సంప్రదింపులు జరిపారని, కియారా కూడా ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. త్వరలోనే పవన్ - హరీష్ కాంబో మూవీలో కియారా ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది. ఇదివరకు కియారా.. సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా భరత్ అనే నేను, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి జంటగా వినయ విధేయ రామ వంటి తెలుగు చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడు పలు హిందీ సినిమాలతో బిజీగా ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



