హైదరాబాదులో గోవిందుడి సందడి
on Apr 18, 2014
కృష్ణవంశీ దర్శకత్వంలో రాంచరణ్, కాజల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం "గోవిందుడు అందరివాడేలే". ఇటీవలే కన్యాకుమారి, పొలాచ్చిలలో చిత్రీకరణ జరిపారు. ఈనెల 21 నుంచి హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో 40 రోజుల పాటు సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్లో నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. ఉమ్మడి కుటుంబంలోని అనురాగాల్ని, ఆప్యాయతలను చాలా చక్కగా కృష్ణవంశీ తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో శ్రీకాంత్, కమలిని ముఖర్జీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.