ఒక్కడివల్లే సినిమా ఆడదు
on Apr 18, 2014
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్, శృతి హాసన్ జంటగా నటించిన చిత్రం "రేసుగుర్రం". ఇటీవలే విడుదలై మంచి ఘనవిజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా హైదరాబాదులో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ సభ్యులందరూ హాజరయ్యారు. ఇందులో బన్నీ మాట్లాడుతూ... ఈ సినిమా నా అన్ని సినిమాల కంటే బిగ్గెస్ట్ హిట్ చిత్రం అవటం నా అదృష్టం. ఈ సినిమాను ఇంత ఘనవిజయం చేసిన ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు. ఈ సినిమా ఇంత విజయం అవడానికి కారణం దర్శకుడు సురేందర్ రెడ్డి మాత్రమే. సినిమాను ఇంత బాగా తీసిన సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస, ఫైట్ మాస్టర్స్ నన్ను మరో మెట్టు పైకి ఎక్కించారు. ఈ సినిమాలో చివరి 15నిముషాలు బ్రహ్మనందానివే. "నీ సినిమాలో బ్రహ్మానందానికి అంత ప్రాధాన్యత ఇవ్వడమేంటి?" అని చాలామంది అన్నారు. కానీ సినిమాను హీరో ఒక్కడే మోయకూడదు. అందరూ పంచుకోవాలి. ఈ సినిమా విషయంలో కూడా అందరూ బాగా కృషి చేసారు. ఆ క్రెడిట్ మొత్తం సురేందర్ రెడ్డికే వెళ్తుంది" అని అన్నారు.