ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్టైమ్.. డైరెక్టర్ కామెంటరీతో విడుదలవుతున్న 'రిపబ్లిక్'
on Nov 23, 2021
సాయి తేజ్ హీరోగా దేవ్ కట్టా దర్శకత్వంలో రూపొందిన సినిమా 'రిపబ్లిక్'. జీబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 1న థియేటర్స్ లో విడుదలైంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ అధికారులు, పాలకులు, ప్రజల పాత్ర ఏమిటన్నది వివరిస్తూ రూపొందిన చిత్రమిది. ప్రజలను చైతన్యపరిచేలా ఉందని ప్రేక్షకులతోపాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ నెల 26న జీ 5 ఓటీటీ వేదికలో ఈ సినిమా విడుదల కానుంది.
సాధారణంగా ప్రేక్షకులు సినిమా చూస్తారు. సినిమాలో సన్నివేశాల గురించి విమర్శకులు విశ్లేషిస్తారు. అయితే.. తాను ఏ కోణంలో సదరు సన్నివేశం తీశానన్నది దర్శకుడి కామెంటరీతో సినిమా చూపిస్తే ఎలా ఉంటుంది?. అటువంటి ప్రయత్నానికి 'జీ 5', దర్శకుడు దేవ్ కట్టా శ్రీకారం చుట్టారు. సినిమా ఎడిటర్ ప్రవీణ్ కె.ఎల్, స్క్రీన్ ప్లే రైటర్ కిరణ్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ సతీష్ బీకేఆర్.. ముగ్గురితో 'రిపబ్లిక్' విజువల్ టైమ్ లైన్ గురించి దేవ్ కట్టా డిస్కస్ చేశారు. డైరెక్టర్ కామెంటరీతో సినిమా చూడాలని కోరుకునే ప్రేక్షకులు ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే సాధారణంగా కూడా సినిమా చూడవచ్చు.
డైరెక్టర్ కామెంటరీతో సినిమాను విడుదల చేయడం ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ టైమ్. ఈ ప్రయోగం అప్ కమింగ్ డైరెక్టర్స్ కి ఉపయోగపడొచ్చు. మరి దీనికి ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
Also Read