నవంబర్ 19న డీఎస్పీ డబుల్ ధమాకా
on Oct 20, 2021
2021 ప్రథమార్ధంలో `అల్లుడు అదుర్స్`, `ఉప్పెన`, `రంగ్ దే` చిత్రాలతో సందడి చేశాడు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్. జనవరిలో `అల్లుడు అదుర్స్` విడుదల కాగా.. ఫిబ్రవరిలో `ఉప్పెన`, మార్చిలో `రంగ్ దే` రిలీజయ్యాయి. వీటిలో `ఉప్పెన` అనూహ్య విజయం సాధించింది. కట్ చేస్తే.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో నాలుగు సినిమాలతో పలకరించబోతున్నాడు డీఎస్పీ. ఆ చిత్రాలే.. `పుష్ప - ద రైజ్`, `ఖిలాడి`, `రౌడీ బాయ్స్`, గుడ్ లక్ సఖి`. వీటిలో `పుష్ప - ద రైజ్` క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న తెరపైకి రాబోతుండగా.. మిగిలిన మూడు సినిమాలకు కూడా అధికారిక విడుదల తేదీలు ఇంకా ప్రకటించలేదు.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. అశిష్ రెడ్డి, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన `రౌడీ బాయ్స్`ని నవంబర్ 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుండగా.. కీర్తి సురేశ్ టైటిల్ రోల్ లో నటించిన `గుడ్ లక్ సఖి`ని కూడా అదే రోజున రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. అదే గనుక నిజమైతే.. నవంబర్ 19న డీఎస్పీ డబుల్ ధమాకా ఇవ్వబోతున్నట్లే. మరి.. ఈ చిత్రాలతో టాలీవుడ్ రాక్ స్టార్ ఎలాంటి ఫలితాలను అందుకుంటాడో చూడాలి.
Also Read