ఏప్రిల్ 25న చందమామ
on Apr 5, 2014
నరేష్, ఆమని, మంచు లక్ష్మీ, కృష్ణుడు, చైతన్య కృష్ణ, రిచా పనాయ్, కిషోర్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన తాజా చిత్రం "చందమామ కథలు". ఈ చిత్రాన్ని ఈనెల 14న విడుదల చేయాలని అనుకున్నారు కానీ మళ్ళీ ఈ సినిమాను వాయిదా వేసారు. ఏప్రిల్ 25న విడుదల చేయనున్నారు. ఇటీవలే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. ఎనిమిది విభిన్న కథలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉన్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చక్రి బూనేటి నిర్మించారు.