"బిజినెస్ మ్యాన్" టిక్కెట్లు లేవ్
on Jan 12, 2012
"బిజినెస్ మ్యాన్" టిక్కెట్లు లేవ్ అని థియేటర్ల ముందు బోర్డులు పెడుతున్నారట. వివరాల్లోకి వెళితే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, డాక్టర్ వెంకట్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం" బిజినెస్ మ్యాన్". ఈ "బిజినెస్ మ్యాన్" చిత్రానికి తమన్ అందించిన సంగీతం చాలా పెద్ద హిట్టయ్యింది. ఈ "బిజినెస్ మ్యాన్" చిత్రం విడుదలైన తొలి వారంలో ఈ చిత్రం ఆడియో తాలూకు హెక్సా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరపటానికి ఈ చిత్రం యూనిట్ సన్నాహాలు చేస్తూంది.
ఈ "బిజినెస్ మ్యాన్" చిత్రం కనీవినీ ఎరుగని రికార్డు స్థాయిలో పదహారు వందల ప్రింట్లు, రెండు వేల స్క్రీన్లలో విడుదల కానుంది. నైజాంలో మూడువందల ప్రింట్లతో విడుదలవుతూండగా, ఒక్క హైదరాబాద్ లోనే నూటపది స్క్రీన్లలో విడుదల అవుతుందని ఈ చిత్రం ఎగ్జిక్యూటీవ్ నిర్మాత సురేష్ రెడ్డి తెలియజేశారు. మహేష్ బాబు అభిమానుల నుంచి వస్తున్న వత్తిడి కారణంగా అవసరమైతే మరో రెండు వందల థియేటర్లలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేస్తామనీ, సంక్రాంతి పండుగకు తెలుప్రేక్షకులకు విందుభోజనంలాంటి సినిమా ఈ "బిజినెస్ మ్యాన్" చిత్రమనీ ఆయన అన్నారు.