పారిస్లో మల్లికా షెరావత్పై దాడి..
on Nov 17, 2016
గన్ చూపించి డబ్బు దోచుకోవడం..జాత్యాంహకార దాడులు ఇలా విదేశాల్లో తరచూ భారతీయులపై దౌర్జన్యకాండ జరుగుతూనే ఉంది. లండన్, పారిస్, మెల్బోర్న్, న్యూయార్క్...ఇలా ఎక్కడ చూసినా ఈ దాడులకు కొదవ లేదు. ఈ భౌతిక దాడుల్లో ఎంతో మంది ధన, మాన ప్రాణాలను పొగొట్టుకున్నారు. ఈ లిస్ట్లో సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా చేరి పోయారు. తాజాగా బాలీవుడ్ సెక్సీబాంబ్, మల్లికా షెరావత్పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటన పారిస్లోని ఆమె సొంత అపార్ట్మెంట్లో జరిగింది.
గత శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో షెరావత్..ఆమె ఫ్రెంచ్ ప్రియుడు సిరిల్తో కలిసి తన అపార్ట్మెంట్కు వచ్చారు. ఆ సమయంలో మాస్క్లు ధరించిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వారిపై టియర్గ్యాస్ చల్లి విచక్షణారహితంగా కొట్టారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దాడి ఘటనపై మల్లిక పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల రోజుల క్రితం మల్లిక పక్క ఫ్లాట్లో ఉండే టీవీ స్టార్ కిమ్ కార్దాషియాన్ను గన్తో బెదిరించి డబ్బు, నగదు దోచుకుపోయారు..ఆ వెంటనే ఈ ఘటన జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.