ENGLISH | TELUGU  

25 కోట్లు కొట్టేసిన వీజే సన్నీ!

on Jan 13, 2023

బిగ్ బాస్ సీజన్ 5  విన్నర్ వీజె సన్నీ హీరోగా సినీ రంగప్రవేశం చేసాడు. ఫేమస్ డైరెక్టర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన వెబ్ సిరీస్ "ఎటిఎం" టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ హరీష్ శంక‌ర్ క్రియేట్ చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ జనవరి 20 నుంచి జీ 5లో ప్రీమియర్ కానుంది. " లైఫ్‌లో ప్రతీ మనిషి సక్సెస్‌ కావడానికి రెండు దారులుంటాయి. ఒకటి కష్టపడి పైకొచ్చేది. రెండోది సులభంగా పైకొచ్చేది. అందరూ కష్టపడి సంపాదించి డబ్బులు దాచుకుంటారు. మేం వాటిని దోచుకుంటాం.." అనే డైలాగ్స్ తో ఈ మూవీ స్టార్ట్ అవుతుంది.. రూ.25 కోట్లు పోయాయని పోలీస్‌ చెప్పడం..మరో వైపు  రూ.25 కోట్లు రెడీ చేసుకుంటే కంఫర్మ్ గా  టికెట్ నీదేనని ఓ పొలిటికల్‌ లీడర్ అనడం ఇంతలో ఆ డబ్బును ఎవరో కొట్టేయడం వంటి సీన్స్ ట్రైలర్ లో బ్యాక్ తో బ్యాక్ కనిపిస్తాయి. ఇంతకీ ఆ డబ్బు ఎత్తుకెళ్లింది ఎవరు ? అసలు అక్కడ  ఏం జరిగింది అనే  విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ మూవీ కోసం కొన్ని డేస్ వెయిట్ చేయక తప్పదు. 

 ఐతే వీజే సన్నీ డబ్బు కట్టలు దొంగతనం చేసి తీసుకుపోతున్నాడంటూ కొన్ని రోజుల క్రితం ఒక సీసీ టీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో హల్చల్ అయ్యింది. ఇప్పుడు ఆ దోపిడీ వెనక ఉన్న మిస్టరీ బయటపడింది. ఆ మిస్టరీనే త్వరలో రిలీజ్ కానున్న "ఎటిఎం" వెబ్ సిరీస్ కి సంబంధించిన మూవీ ప్రమోషన్.  

ఇక ఈ వెబ్ సిరీస్ లో జ‌గ‌న్ గా బిగ్ బాస్ విన్నర్  వి.జె.స‌న్నీ, పోలీస్ ఆఫీస‌ర్ గా సుబ్బ‌రాజు  మ‌ధ్య జ‌రిగే యుద్ధ‌మే ఈ  ఏటీఎం. దోపిడి ప్ర‌ధానంగా సాగే యాక్ష‌న్ క్రైమ్ డ్రామా..బిగ్ బాస్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు వీజే సన్నీ.. ఇక ఇప్పుడు ఈ  వెబ్ సిరీస్ తో  ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.