పవన్ కళ్యాణ్ డైరెక్టర్కు హీరో దొరికాడు!
on Jan 28, 2023
పవన్ కళ్యాణ్ ఇటీవల మలయాళం లో వచ్చిన అయ్యప్పమ్ కోసియం ఆధారంగా తెలుగులో బీమ్లా నాయక్ ను రీమేక్ చేశారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాశారు. రానా కీలక పాత్రలో నటించారు. నిత్యమీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదలైంది. ఈ మూవీకి గతంలో శ్రీ విష్ణు,నారా రోహిత్ లతో అప్పట్లో ఒకడుండేవాడు చిత్రాన్ని తెరకెక్కించి మంచి పేరు తెచ్చుకున్న సాగర్ చంద్ర దర్శకత్వం వహించారు. అయితే పేరుకే సాగర్ చంద్ర గాని దర్శకత్వం మొత్తం త్రివిక్రమే చేశాడని మీడియాలో నాడు వార్తలు గుప్పుమన్నాయి. ఈ సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా మరో హీరో సాగర్ చంద్రకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఎట్టకేలకు సాగర్ చంద్రాకు హీరో దొరికాడు. అతను మరెవరో కాదు బెల్లంకొండ సాయి శ్రీనివాస్.
అల్లుడు శీను మూవీతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీనివాస్ పేరు గత కొంతకాలంగా వినిపించడం లేదు. అల్లుడు అదుర్స్ ఫ్లాప్ కావడంతో చత్రపతి హిందీ రీమేక్ ని వి వి వినాయకుతో ఏకధాటిగా చేస్తున్నారు. బాలీవుడ్ కి చెందిన పెన్ స్టూడియోస్ అధినేత జయంతి లాల్ దీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలీదు. థియేట్రికల్ రిలీజ్ ఉండదని నేరుగా ఓటీటీలో విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈ కారణాల వలన కొన్ని నెలలుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడాలైమ్ లైటులో కనిపించడం లేదు. మరోవైపు సాగర్ చంద్ర కూడా లైమ్ లైటులో లేడు. ఇప్పుడు వీరిద్దరూ కలిశారు.చత్రపతి ప్రొడక్షన్లో ఉండగానే భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ చంద్రకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించబోతున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా 14 రీల్స్ వారి చేతికి రావడం ఆశ్చర్యమే అని ఇన్సైడ్ టాక్. మరి ఈ మూవీని తెలుగులో చేస్తున్నారా? లేక చత్రపతి తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా ద్వారా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సాగర్ చంద్ర మరలా లైమ్ లైట్ లోకి వస్తారా లేదా అనేది వేచి చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
