అనుష్కతో పాటు త్రిష రొమాన్స్...!
on Apr 8, 2014
అజిత్ తన 55వ చిత్రాన్ని దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా అనుష్క నటించనుంది. అయితే మరో హీరోయిన్ గా త్రిషను తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. గౌతమ్ దర్శకత్వంలో తెరకెక్కిన "ఏమాయ చేసావే"(తమిళం) వర్షన్ లో నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. అందుకే త్రిషను ఈ సినిమాలో మరో హీరోయిన్ గా తీసుకోవడానికి గౌతమ్ ప్రయత్నిస్తున్నాడని తెలిసింది. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్లో ప్రముఖ నిర్మాత ఎఎం రత్నం నిర్మించనున్న ఈ చిత్రానికి హరీస్ జయరాజ్ సంగీతం అందించనున్నాడు. ఇందులో అరవింద్ స్వామి, అరుణ్ విజయ్ విలన్ పాత్రలో నటించనున్నారు. ఏప్రిల్ 9న సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.