ENGLISH | TELUGU  

అఖిల్ కోసం అల్లు అర్జున్.. సెలబ్రేషన్స్ షురూ!

on Oct 18, 2021

అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీవాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. దసరా కానుకగా ఈ నెల 15న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. దీంతో మేకర్స్ గ్రాండ్ గా సక్సెస్ మీట్ ను ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరు కానున్నారు.

మొదటి మూడు సినిమాలు(అఖిల్, హలో, మిస్టర్ మజ్ను)తో నిరాశపరిచిన అఖిల్.. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'తో ఫస్ట్ సక్సెస్ ని రుచి చూసాడు. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ మంచి వసూళ్లను రాబడుతోంది. దీంతో ఇప్పటికే ఆదివారం వైజాగ్‌లో థ్యాంక్యూ మీట్ నిర్వహించిన మూవీ టీమ్.. మంగళవారం హైదరాబాద్ లో గ్రాండ్‌ సక్సెస్ ఈవెంట్‌ కు ప్లాన్ చేసింది. అక్టోబర్ 19 సాయంత్రం ఆరు గంటల నుండి జేఆర్‌సీ కన్వెన్షన్‌ లో జరగనున్న ఈ ఈవెంట్ కు అల్లు అర్జున్ రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్.

ఇదిలా ఉంటే.. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 25 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సూపర్ హిట్ దిశగా పరుగులు తీస్తోంది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.