తెలుగులో భారీగా విడుదలవుతున్న అరుణ్ విజయ్ 'ఆక్రోశం'
on Dec 1, 2022
వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న అరుణ్ విజయ్ హీరోగా జి.యన్.కుమార వేలన్ డైరెక్షన్లో రూపొందిన చిత్రం 'ఆక్రోశం'. సీహెచ్.సతీష్ కుమార్ అసోసియేషన్తో విఘ్నేశ్వర ఎంటర్ టైన్మెంట్, మూవీ స్లయిడర్స్ బ్యానర్స్పై ఆర్.విజయ్ కుమార్ నిర్మించారు. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన తమిళ చిత్రం 'సినం'ను తెలుగులో 'ఆక్రోశం' పేరుతో డిసెంబర్ 9న భారీ స్థాయిలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్బంగా నిర్మాతలు సతీష్ కుమార్, విజయ్ కుమార్ మాట్లాడుతూ.. "మంచి సినిమాలు, డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అరుణ్ విజయ్గారు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. ఆయన హీరోగా నటించిన సినిమాలు కూడా ఇక్కడ మంచి ఆదరణను పొందాయి. ఇంత ముందు అరుణ్ విజయ్ హీరోగా నటించిన 'ఏనుగు' సినిమాను మా బ్యానర్లో విడుదల చేశాం. రీసెంట్గా తమిళంలో అరుణ్ విజయ్ మీరోగా నటించిన 'సినం' సినిమా తమిళంలో సూపర్బ్ రెస్పాన్స్ను రాబట్టుకుంది. దాన్ని తెలుగులో 'ఆక్రోశం' పేరుతో డిసెంబర్ 9న రిలీజ్ చేస్తున్నాం. యాక్షన్, థ్రిల్లర్, రివేంజ్ ఇలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కలగలిసిన చిత్రమిది. తప్పకుండా తెలుగు ఆడియెన్స్ సినిమా ఎంజాయ్ చేస్తారు" అన్నారు.
పల్లక్ లల్వాని హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో కాళీ వెంకట్, ఆర్.ఎన్.ఆర్. మనోహర్, కె.ఎస్.జి. వెంకటేష్, మరుమలార్చి భారతి తది తరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు షబీర్ తబరే ఆలం సంగీతం అందించారు. గోపీనాథ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.