2022 ఫస్టాఫ్ రివ్యూ 6: ఆకట్టుకున్న కొత్త జోడీలు!
on Jun 25, 2022
2022 ప్రథమార్ధంలో కొన్ని కొత్త జంటలు తెలుగు తెరపై కనువిందు చేయడమే కాకుండా.. విజయాన్ని కైవసం చేసుకున్నాయి. ఆ జోడీల వివరాల్లోకి వెళితేః
నాగచైతన్య - కృతి శెట్టిః
సంక్రాంతి స్పెషల్ గా విడుదలైన `బంగార్రాజు` కోసం నాగచైతన్య - కృతిశెట్టి తొలిసారిగా జంటగా సందడి చేశారు. తమ కెమిస్ట్రీతో సినిమాకి ప్రధాన బలంగా నిలిచారు.
సిద్ధు జొన్నలగడ్డ - నేహా శెట్టిః
ఫిబ్రవరి 12న విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ `డీజే టిల్లు`లో మొదటిసారిగా జోడీ కట్టారు సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి. ఈ ఇద్దరి జంట యువతరాన్ని విశేషంగా అలరించింది.
పవన్ కళ్యాణ్ - నిత్యా మీనన్, రానా - సంయుక్త మీనన్ః
ఫిబ్రవరి 25న తెరపైకి వచ్చిన బాక్సాఫీస్ విన్నర్ `భీమ్లా నాయక్`లో రెండు కొత్త జంటలు కనువిందు చేశాయి. ఈ సినిమా కోసమే పవన్ కి జోడీగా నిత్యా మీనన్ ఫస్ట్ టైమ్ కనిపించగా.. రానా, సంయుక్తా మీనన్ కూడా మొదటిసారి జతకట్టారు.
రామ్ చరణ్ - ఆలియా భట్, ఎన్టీఆర్ - ఓలివియాః
మార్చి 25న రిలీజైన పాన్ - ఇండియా బ్లాక్ బస్టర్ `ఆర్ ఆర్ ఆర్`లోనూ రెండు ఫ్రెష్ పెయిర్స్ ఎంటర్టైన్ చేశాయి. రామ్ చరణ్ - ఆలియా భట్ ఒక జోడీగానూ, ఎన్టీఆర్ - ఓలివియా మోరీస్ మరో జంటగానూ దర్శనమిచ్చారు.
మహేశ్ బాబు - కీర్తి సురేశ్ః
మే 12న విడుదలై వసూళ్ళ వర్షం కురిపించిన `సర్కారు వారి పాట` కోసం మహేశ్ బాబు, కీర్తి సురేశ్ ఫస్ట్ టైమ్ టీమ్ అప్ అయ్యారు. సిల్వర్ స్క్రీన్ పై ఈ ఫ్రెష్ పెయిర్ మెస్మరైజ్ చేసింది.
అడివి శేష్ - సయీ మంజ్రేకర్ః
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన `మేజర్`లో అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంట చూపరులను భలేగా ఆకట్టుకుంది. జూన్ 3న విడుదలైన ఈ చిత్రం విజయపథంలో పయనించింది.