`ఖిలాడి` పెయిర్.. బాక్సాఫీస్ వార్!
on Jun 25, 2022
మాస్ మహారాజా రవితేజ టైటిల్ రోల్ లో నటించిన `ఖిలాడి`లో ఓ కథానాయికగా ఎంటర్టైన్ చేసింది మీనాక్షి చౌదరి. మంచి అంచనాల నడుమ విడుదలైన సదరు యాక్షన్ ఎంటర్టైనర్ ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. కట్ చేస్తే.. త్వరలో ఇటు రవితేజ, అటు మీనాక్షి చౌదరి తమ తమ తదుపరి చిత్రాలతో బాక్సాఫీస్ వార్ కి సిద్ధమవుతున్నారు.
ఆ వివరాల్లోకి వెళితే.. `రామారావు ఆన్ డ్యూటీ` పేరుతో శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ ఓ యాక్షన్ థ్రిల్లర్ చేసిన సంగతి తెలిసిందే. దివ్యాంశ కౌశిక్, రాజీషా విజయన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాని తొలుత జూన్ 17న విడుదల చేయాలనుకున్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల జూలై 29కి వాయిదా పడింది. ఇక అదే రోజు అడివి శేష్ కి జోడీగా మీనాక్షి చౌదరి నటించిన `హిట్ః ద సెకండ్ కేస్` విడుదల కాబోతోంది. నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో టాలెంటెడ్ కెప్టెన్ శైలేష్ కొలను ఈ చిత్రాన్ని రూపొందించాడు. మరి.. ఒకే రోజున వేర్వేరు చిత్రాలతో బాక్సాఫీస్ వార్ కి రెడీ అయిన ఈ `ఖిలాడి` పెయిర్.. ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి.
Also Read