డీజే ఆడియో వేడుకకి చిరంజీవి అందుకే రాలేదు..?
on Jun 12, 2017
మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా రావాల్సింది. కానీ, నిన్న మెగాస్టార్ ఫంక్షన్లో ఎక్కడ కనిపించలేదు. మెగాభిమానులకు చిరు ఎందుకు రాలేదో అర్ధం కాక కాస్త నిరాశలో ఉన్నారు. ఇంతకీ చిరంజీవి ఎందుకు రాలేదు అంటే, దాసరి నారాయణ రావు మృతికి నివాళిగా ఈ వేడుకకి దూరంగా ఉందాం అని నిర్ణయించుకున్నారట. మొన్నామధ్య జరిగిన దాసరి సంతాప సభలో చిరంజీవి కూడా పాల్గొన్నారు. తాను చైనాలో ఉండి గురువుగారు దాసరి గారి అంతిమ యాత్రకి రాలేకపోయానని... పెద్ద దిక్కు కోల్పోయినట్టుగా అనిపిస్తుందని అన్నారు. ఈ సంతాప కార్యక్రమం జరిగిన వెంటనే డీజే ఆడియో వేడుకకి వెళ్లడం సరైన పద్ధతి కాదు కాబట్టి లాస్ట్ మినిట్ లో వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. అయితే, మెగాస్టార్ ఈ నెల 18 న జరగనున్న డీజే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి హాజరవ్వనున్నట్టు సమాచారం. ఈ వేడుక హైద్రాబాద్లో చేస్తారా లేక ఇంతకు ముందు అనుకున్నట్లుగా వైజాగ్ లో చేస్తారా స్పష్టత లేదు. ఇంతకు ముందు చిరు, అల్లు అర్జున్ సరైనోడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి విచ్చేస్తే ఆ సినిమా పెద్ద హిట్ అయింది. డీజే కి కూడా ఇది రిపీట్ అవ్వాలని కోరుకుందాం!
Also Read