English | Telugu
కుమారిగా ఉంటేనే లైఫ్ ప్రశాంతం.. లేదంటే డైపర్లు పట్టుకుని తిరగాలి!
Updated : Aug 13, 2023
శ్రావణ మాసం వచ్చేసింది. శ్రావణ శుక్రవారాలు, మహాలక్ష్మి వ్రతాలు ఇళ్లన్నీ పండగ వాతావరణంతో సందడి చేస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో బుల్లితెర మీద ఈవెంట్లు, షోలు ఎక్కువగానే రెడీ అవుతున్నాయి. ఇప్పుడు స్టార్ మాలో "మా వరలక్ష్మి వ్రతం" త్వరలో ప్రసారం కాబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ ఈవెంట్ కి ఉదయభాను హోస్ట్ గా వస్తోంది. ఇందులో "కుమారీలు వెర్సెస్ శ్రీమతులు" అనే థీమ్ తో పెళ్లి కానీ వాళ్ళను పెళ్ళైన వాళ్ళను తీసుకొచ్చి గేమ్స్ ఆడించారు. ఇందులో రెండు టీమ్స్ మధ్య రచ్చ కూడా మాములుగా లేదు. జ్యోతక్క అలియాస్ శివజ్యోతికి కోపం వచ్చేసింది " మీరు కేవలం కుమారీలు మాత్రమే.. అంత బిల్డప్ అవసరం లేదు" అని కుమారీలను ఉద్దేశించి అనేసరికి " మీరంతా శ్రీమతులే..శ్రీమంతుడు మూవీలో శృతిహాసన్ కాదు" అంటూ కుమారీల టీమ్ నుంచి ప్రేరణ శ్రీమతులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చేసింది. దానికి అవినాష్ షాకయ్యాడు.
ఇక ఈ షోకి "బేబీ" ఫేమ్ వచ్చేసింది. మస్త్ డాన్స్ చేసి ఎంజాయ్ చేసింది. "కుమారీలుగా ఉంటేనే లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది" కదా అని ఉదయభాను అడిగేసరికి "లేదంటే సంకలో పిల్లల్నెత్తుకుని మరో చేతిలో డైపర్లు పెట్టుకుని వెళ్తూ ఉండాలి" అని చెప్పేసరికి అందరూ నవ్వేశారు. ఇక ఈ షోలో బుల్లితెర జోడీస్ డాన్సస్ చేసేశాయి. ఇక ఈ వరలక్ష్మి వ్రతం ఈవెంట్ లో అవినాష్ వైఫ్ అనుజకి సీమంతం వేడుకను నిర్వహించారు. ఈసారి "మాటీవీ వరలక్ష్మి వ్రతం ఎంటెర్టైన్మెంటే మొత్తం" అని చెప్పింది ఉదయభాను.