English | Telugu
33 ఏళ్ళు అవుతున్నా నాకేం కావాలో ఆయనకు తెలీదు!
Updated : Aug 13, 2023
"నీతోనే డాన్స్" షో ఈవారం సెమీఫైనల్స్ కి వచ్చేసింది. ఇక ఈ వారం రెండు టీమ్ లు వచ్చి మంచి డాన్స్ పెర్ఫార్మెన్సెస్ చేశాయి. ఆట సందీప్-జ్యోతి డాన్స్ చూసి ఫుల్ ఫిదా ఐపోయిన రాధను శ్రీముఖి తన పెళ్లి గురించి అడిగేసరికి ఆమె ఎన్నో విషయాలను చెప్పారు.
"సెప్టెంబర్ 9 వస్తే మా పెళ్ళై 33 ఏళ్ళు. పెళ్లి గురించి మ్యారేజ్ లైఫ్ గురించి నాకు ఎక్కువ అవగాహన ఉంది. నా ఫామిలీతో నాకు చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. ఈ ఫోటో చాలా ఓల్డ్ ది.. దీని వెనక చాలా మెమోరీస్ ఉన్నాయి. ఐ లవ్ ఫొటోస్. కొన్ని సందర్భాల్లో మెమోరీస్ అన్నీ కూడా గుర్తుండవు కదా. అందుకే నేను ఎక్కువగా ఫొటోస్ తీసుకోవడానికి ఇష్టపడతాను. ఎందుకంటే ఆ ఫోటో చూస్తే ఆ మెమరీ గుర్తొస్తుంది. కానీ నేను ఫోటో తీసుకోవాలని అనుకున్నప్పుడు కార్తీక నా మీద అరుస్తుంది. అమ్మా ఎంజాయ్ ది మూమెంట్ అంటుంది... ఒకే మా నేను మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నాను. కానీ నాకు ఈ మెమరీ గుర్తురావడం కోసం ఫొటోస్ తీసుకుంటున్నా అని చెప్తుంటాను నేను మళ్ళీమళ్ళీ ఆ మొమెంట్ ని ఎంజాయ్ చేయాలంటే ఫోటో అనేది ఇంపార్టెంట్. ఇంకో విషయం చెప్పాలంటే నా టార్గెట్ 5 కిడ్స్. ఇంకో ట్విన్స్ కోసం అలా ప్రార్ధించాను. ఒకసారి ఓనం సెలెబ్రేషన్స్ టైంలో ఇల్లంతా పిల్లలతో కళకళలాడిపోతోంది. అప్పుడు మా అత్తమ్మ చెప్పింది నీకు మినిమం ఐదుగురు పిల్లల్ని కనాలని చెప్పింది. కుదిరితే 8 మంది పిల్లలుంటే బాగుండు అనుకున్నా అందులో అందరూ ట్విన్స్ ఉండాలి. ఐ లవ్ కిడ్స్ అని కాదు కానీ ఇప్పుడు నా పిల్లల్ని చూసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. పిల్లలందరినీ చూసుకున్నప్పుడు నాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది. మా ఆయన ఇప్పటికీ ఒకటి అడుగుతారు..ఎం కావాలే నీకు అని అడుగుతారు, ఏంటి నీ ప్రాబ్లమ్ అంటారు.. నేను చెప్పను అంటాను... 33 ఇయర్స్ ఐపోతోంది ఇంకా నీకు ఏమీ తెలీదంటే గో టు హెల్ అని అంటుంటాను" అని తన పెళ్లి గురించి ఎన్నో మెమోరీస్ ని నీతోనే డాన్స్ షోలో జడ్జి రాధ షేర్ చేసుకున్నారు.