English | Telugu

33 ఏళ్ళు అవుతున్నా నాకేం కావాలో ఆయనకు తెలీదు!

"నీతోనే డాన్స్" షో ఈవారం సెమీఫైనల్స్ కి వచ్చేసింది. ఇక ఈ వారం రెండు టీమ్ లు వచ్చి మంచి డాన్స్ పెర్ఫార్మెన్సెస్ చేశాయి. ఆట సందీప్-జ్యోతి డాన్స్ చూసి ఫుల్ ఫిదా ఐపోయిన రాధను శ్రీముఖి తన పెళ్లి గురించి అడిగేసరికి ఆమె ఎన్నో విషయాలను చెప్పారు.

"సెప్టెంబర్ 9 వస్తే మా పెళ్ళై 33 ఏళ్ళు. పెళ్లి గురించి మ్యారేజ్ లైఫ్ గురించి నాకు ఎక్కువ అవగాహన ఉంది. నా ఫామిలీతో నాకు చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. ఈ ఫోటో చాలా ఓల్డ్ ది.. దీని వెనక చాలా మెమోరీస్ ఉన్నాయి. ఐ లవ్ ఫొటోస్. కొన్ని సందర్భాల్లో మెమోరీస్ అన్నీ కూడా గుర్తుండవు కదా. అందుకే నేను ఎక్కువగా ఫొటోస్ తీసుకోవడానికి ఇష్టపడతాను. ఎందుకంటే ఆ ఫోటో చూస్తే ఆ మెమరీ గుర్తొస్తుంది. కానీ నేను ఫోటో తీసుకోవాలని అనుకున్నప్పుడు కార్తీక నా మీద అరుస్తుంది. అమ్మా ఎంజాయ్ ది మూమెంట్ అంటుంది... ఒకే మా నేను మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నాను. కానీ నాకు ఈ మెమరీ గుర్తురావడం కోసం ఫొటోస్ తీసుకుంటున్నా అని చెప్తుంటాను నేను మళ్ళీమళ్ళీ ఆ మొమెంట్ ని ఎంజాయ్ చేయాలంటే ఫోటో అనేది ఇంపార్టెంట్. ఇంకో విషయం చెప్పాలంటే నా టార్గెట్ 5 కిడ్స్. ఇంకో ట్విన్స్ కోసం అలా ప్రార్ధించాను. ఒకసారి ఓనం సెలెబ్రేషన్స్ టైంలో ఇల్లంతా పిల్లలతో కళకళలాడిపోతోంది. అప్పుడు మా అత్తమ్మ చెప్పింది నీకు మినిమం ఐదుగురు పిల్లల్ని కనాలని చెప్పింది. కుదిరితే 8 మంది పిల్లలుంటే బాగుండు అనుకున్నా అందులో అందరూ ట్విన్స్ ఉండాలి. ఐ లవ్ కిడ్స్ అని కాదు కానీ ఇప్పుడు నా పిల్లల్ని చూసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. పిల్లలందరినీ చూసుకున్నప్పుడు నాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది. మా ఆయన ఇప్పటికీ ఒకటి అడుగుతారు..ఎం కావాలే నీకు అని అడుగుతారు, ఏంటి నీ ప్రాబ్లమ్ అంటారు.. నేను చెప్పను అంటాను... 33 ఇయర్స్ ఐపోతోంది ఇంకా నీకు ఏమీ తెలీదంటే గో టు హెల్ అని అంటుంటాను" అని తన పెళ్లి గురించి ఎన్నో మెమోరీస్ ని నీతోనే డాన్స్ షోలో జడ్జి రాధ షేర్ చేసుకున్నారు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.