English | Telugu

ఇది త‌ప్పుడు కేస‌ని ప‌క్కా ఆధారాలతో నిరూపిస్తా!

తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసు పెట్టారని.. త్వరలోనే నిజానిజాలతో అందరి ముందుకు వస్తానని.. బుల్లితెర నటుడు, యాంకర్ శ్యామల భర్త నరసింహారెడ్డి తెలిపారు. ఓ మహిళను మోసం చేయడమే కాకుండా.. లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో రెండు రోజుల క్రితం నరసింహారెడ్డిని అరెస్ట్ చేయగా.. తాజాగా ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు. వెంటనే సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. తనపై ఎన్నో మోసపూరిత ఆరోపణలు వచ్చినప్పటికీ.. తనకు, తన కుటుంబానికి అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు.

భార్య శ్యామ‌ల ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన వీడియోలో దేవుడి దయవల్ల ఇంటికి తిరిగి వచ్చానని.. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తన గురించి వస్తోన్న కథనాలకు సంబంధించిన అన్ని నిజానిజాలను పంచుకోవడానికి కొన్ని రోజుల్లో మీ ముందుకు వస్తానని అన్నారు. అసలు కేసు ఏంటి..? అందులో నిజాలేంటి ఇలా అన్ని రకాల ఆధారాలతో మిమ్మల్ని కలుస్తానని అన్నారు. అప్పుడు జనాలకే ఓ అంచనా వస్తుందని.. న్యాయం, న్యాయస్థానంపై తనకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. ఇదొక తప్పుడు కేసు అనడానికి పక్కా ఆధారాలతో నిరూపిస్తానని చెప్పారు. కొన్నిసార్లు ఇలాంటి నిందలు పడాల్సి ఉంటుందని.. కానీ వచ్చిన రూమ‌ర్ల‌పై తప్పకుండా స్పందించాల్సిన అవసరం ఉందని నరసింహారెడ్డి అన్నారు.

గండిపేట ఏరియాలో పబ్, గేమ్ జోన్ లాంటివి అభివృద్ధి చేయడానికి పెట్టుబడి పెట్టాలని ప్రతిపాదిస్తూ.. నరసింహారెడ్డి తన వద్ద నుండి కోటి రూపాయల వరకు నగదు తీసుకున్నాడని సింధూరారెడ్డి అనే మహిళ ఫిర్యాదు చేసింది. తీసుకున్న డబ్బు తిరిగివ్వమని అడిగితే తనపై దాడికి దిగినట్లు ఆమె ఆరోపించడంతో నరసింహారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు బెయిల్ పై బయటకి వచ్చిన అతడు.. ఇదంతా తప్పుడు కేసు అని, ఆధారాలతో నిరూపిస్తానని అంటున్నాడు.

Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.