English | Telugu

హైపర్ ఆది మాకు గాడ్‌.. దొర‌బాబు భార్య కామెంట్‌!

'జబర్దస్త్' కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన చేసే కామెడీ, వేసే పంచ్ లు అతడికి విపరీతమైన క్రేజ్ ను తీసుకొచ్చాయి. బుల్లితెరపై తనదైన కామెడీతో హల్చల్ చేస్తోన్న హైపర్ ఆది.. తన షోలలో మహిళలను, లేడీ యాంకర్స్ ను టార్గెట్ చేస్తూ పంచ్ లు వేస్తుంటాడు. ఒక్కోసారి ఈ పంచ్ లు శృతి మించడంతో విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. అయితే హైపర్ ఆది టీమ్ లో పని చేసే దొరబాబు, పరదేశీ అనే ఇద్దరు కమెడియన్లు గతంలో వ్యభిచారం కేసులు పట్టుబడిన సంగతి తెలిసిందే.

అప్పట్లో ఈ కేసు సంచలనంగా మారింది. ఆ సంఘటన జరిగి ఏడాది దాటేసినా.. ఇప్పటికీ హైపర్ ఆది తన స్కిట్ లలో వారిని ఉద్దేశిస్తూ పంచ్ డైలాగ్స్ వేస్తూనే ఉన్నాడు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ షోలో దొరబాబు తన భార్య అమూల్యతో కలిసి కనిపించాడు. ఈ షోకి హోస్ట్ గా వ్యవహరించిన సుడిగాలి సుధీర్.. దొరబాబుని ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ అని అతడి భార్యని అడగగా.. తన ఇంట్లో వాళ్ళు దొరలాంటి వాడిని పెళ్లి చేసుకోమని చెబితే.. దొరలాంటి వాడు ఎందుకని దొరబాబునే పెళ్లి చేసుకున్నానంటూ పంచ్ వేసింది.

ఇది విన్న హైపర్ ఆది.. 'నీకు టిక్ టాక్ లో అంత ఫాలోయింగ్ ఎందుకు వచ్చిందో నాకు ఇప్పుడు అర్ధమైంది' అంటూ కౌంటర్ వేశాడు. ఇక ఆ తరువాత అమూల్య మాట్లాడుతూ.. 'మేము కష్టాలలో ఉన్నప్పుడు ఎవరూ ఆదుకోలేదు. ఇక మాకెవరూ లేరని అనుకున్న సమయంలో హైపర్ ఆది ముందుకొచ్చారు. మాకు సాయం చేసి ఆదుకున్నారు. అందుకే ఆయన నెంబర్ ను మా ఫోన్ లో గాడ్ అని సేవ్ చేసుకున్నాం' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.